హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రాలో కలుపకుంటే పోలవరం ప్రాజెక్టు మనకు కలగానే మిగిలేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఏపీలోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం పీఎల్ పురం వద్ద పోలవరం ఎడమకాలువ ద్వారా గోదావరి జలాలను బుధవారం సీఎం చంద్రబాబు విడుదల చేశారు. అనంతరం మాట్లాడారు.
విభజన చట్టంలో పోలవరం ఉన్నదని, కానీ నాడు 7 మండలాలు తెలంగాణలో ఉన్నాయని గుర్తుచేశారు. తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీకి ఇస్తేనే తాను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని, నాడు మోదీకి తాను తేల్చి చెప్పినట్టు వెల్లడించారు.