సారంగాపూర్, ఫిబ్రవరి 11: పౌరహక్కుల సంఘం నేత పోగుల రాజేశంను ఆదివారం ఛత్తీస్గఢ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు వాహనాల్లో మఫ్టీలో వచ్చిన పోలీసులు జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లిలో అరెస్ట్ చేశారు. ఈ విషయమై స్థానిక ఎస్సై తిరుపతిని సంప్రదించగా ఛత్తీస్గఢ్లో రాజేశంపై కేసు ఉన్నదని, ఈ నేపథ్యంలో కోర్టులో హాజరుపరిచేందుకే తీసుకెళ్లారని చెప్పారు.
రాజేశం భార్య మల్లవ్వ మాట్లాడుతూ.. రెండు వాహనాల్లో 10 మంది వచ్చి తన భర్తను కొడుతూ తీసుకెళ్లారని ఆరోపించారు. తాను సైతం భర్త వెంట వాహనంలో వెళ్లగా బట్టుపల్లి వద్ద బలవంతంగా బయటకు దింపేశారని వాపోయారు. కొడుకుతో కలిసి ఫిర్యాదు చేసేందుకు జగిత్యాల డీఎస్పీ వద్దకు వెళ్లగా దంతేవాడలో నమోదైన కేసు విచారణ నిమిత్తం ఛత్తీస్గఢ్ పోలీసులు తీసుకెళ్లినట్టు చెప్పారని మల్లవ్వ పేర్కొన్నారు.