బాన్సువాడ, ఏప్రిల్ 25: బీఆర్ఎస్ నాయకత్వాన్ని దేశం కోరుకుంటున్నదని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అభివృ ద్ధి, సంక్షేమ రంగాల్లో తెలంగాణ ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు తమకూ కావాలని, లేకపోతే తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని పొరుగు రాష్ర్టాల ప్రజలు కోరుతున్నారని తెలిపారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి ప్రతినిధుల సమావేశంలో స్పీకర్ పో చారం మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమం రాష్ట్ర ప్రభుత్వానికి రెండు కండ్లు అని అన్నా రు. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు నియోజకవర్గ అభివృద్ధికి రూ.11 వేల కోట్లు వెచ్చించామని వివరించారు. కండ్లుండి చూడలేని వారి కోసం బాన్సువాడలో అభివృద్ధి పనుల ఫొటో ఎగ్జిబిషన్ను పెడతానని చెప్పారు.