హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): ఎమ్మెల్సీలుగా ఏకగ్రీవంగా ఎన్నికైన పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, వెంకట్రామిరెడ్డి శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే కోటాలో వెంకట్రామిరెడ్డి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. బాగా పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం వారికి సూచించారు.