హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ప్రధాని మోదీ (PM Modi) దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. మంగళవారం ఉదయం సికింద్రాబాద్ మహంకాళి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అర్చకులు ప్రధానికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రదక్షణ చేసిన మోదీ.. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. అమ్మవారి శేష వస్త్రంతోపాటు చిత్రపటాన్ని అందించారు. మహంకాళి ఆలయం నుంచి సంగారెడ్డి జిల్లా పర్యటనకు బలయల్దేరారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
#WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX
— ANI (@ANI) March 5, 2024