శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రంలో ప్లాస్టీక్ వాడవాన్ని పూర్తిగా నివారించేందుకు ఆంక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్రానికి వచ్చే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుండటంతో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఇప్పటి వరకు వ్యాపారస్తులకు, స్థానిక ప్రజలకు పలు అవగాహన సదస్సులు కూడా నిర్వహించారు. ప్రధానంగా యూజ్ అండ్ త్రో వాటర్ బాటిళ్ల వాడకం విపరీతమవ్వడంతో ప్రతి రోజు క్షేత్ర పరిధిలో క్వింటాళ్ల కొద్ది బాటిళ్లు రొడ్లపై పారవేస్తున్నారని పేర్కొన్నారు.
అదే విధంగా ప్రధాన కూడళ్లలోని హోటళ్లు టీస్టాల్స్ వద్ద వాటర్ బాటిళ్ల వాడకాన్ని నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని శానిటేషన్ విభాగపు అధికారులు సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేసినట్లు తెలిపారు. క్షేత్ర పరిధిలోని వర్తక వ్యాపార సంస్థలవారు సహా హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాల్స్ వారికి త్వరలో ప్లాసీక్ నిషేధంపై తాఖీదులు జారీచేసి నిబంధనలు అమలయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దేవస్థానం నిర్ణయాలను నిబంధనలను ఉల్లంఘించిన వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకొనున్నట్లు హెచ్చరించారు.