గ్రీన్ చాలెంజ్ స్ఫూర్తితో కదిలిన వైద్యులు
ఎంపీ సంతోష్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా
మొక్కలు నాటిన డెంటల్ డాక్టర్లు, విద్యార్థులు
హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా వైద్యులు పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు ఎంపీ సంతోష్కుమార్ ఇచ్చిన పిలుపుతో కదిలిన వైద్యులు, వైద్య విద్యార్థులు గ్రీన్చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర డెంటల్ కౌన్సిల్ ఆధ్వర్యంలో 14 దంత వైద్య కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది, వైద్య విద్యార్థులు కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వందల మంది డాక్టర్లు, నర్సులు, వైద్య విద్యార్థులు, సిబ్బంది స్వచ్ఛందంగా పాల్గొని మొక్కలు నాటడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని ఎంపీ సంతోష్ వెల్లడించారు. గ్రీన్ ఇండియా చాలెంజ్ పిలుపుతో మొక్కలు నాటిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.
మొక్కలు నాటిన దంత వైద్య కళాశాలలు
హైదరాబాద్ గవర్నమెంట్ డెంటల్ కాలేజీ, సంగారెడ్డి ఎంఎన్ఆర్ డెంటల్ కాలేజీ, మల్లారెడ్డి డెంటల్ కాలేజీ (హైదరాబాద్), ఆర్మీ డెంటల్ కాలేజీ (సికింద్రాబాద్), శ్రీబాలాజీ డెంటల్ కాలేజీ (మెయినాబాద్), జోగినపల్లి భాస్కర్రావు ఇన్స్టిట్యూషన్స్, ఎస్వీఆర్ డెంటల్ కాలేజీ (మహబూబ్నగర్), మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, పానీనియా డెంటల్ కాలేజీ (చైతన్యపురి), మేఘన డెంటల్ కాలేజీ (నిజామాబాద్), మమతా డెంటల్ కాలేజీ (ఖమ్మం), శ్రీసాయి డెంటల్ కాలేజీ (వికారాబాద్), మమత డెంటల్ కాలేజీ (బాచుపల్లి), కామినేని డెంటల్ కాలేజీ (నార్కట్పల్లి)