హైదరాబాద్ : ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ చాలా గొప్ప కార్యక్రమం. మొక్కలు నాటడం అంటే దైవకార్యంతో సమానం అని పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.పద్మజారెడ్డి అన్నారు.
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బేగంపేటలోని తన నివాసంలో డా.పద్మజారెడ్డి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిందన్నారు. ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటుతున్నారని, ఈ రోజు నేను పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందని అన్నారు.
చెట్లు అంటే తనకు చాలా ఇష్టమని అన్నారు. మొక్కలు పెరిగి పెద్దయి తల్లిలా చూసుకుంటాయని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయని అన్నారు. ప్రతి ఒక్కరు వీలైనన్ని మొక్కలు నాటాలని కోరారు.
ప్రభుత్వం ఇల్లు కట్టుకునేముందు ప్రతి ఒక్కరు తమ ఇంటివద్ద మొక్కలు నాటాలని ఒక రూల్ తెస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు తన స్నేహితులు ప్రతిభ, వనజ, ఉమరాణి కి గ్రీన్ ఇండియా చాలెంజ్ విసిరారు.