హైదరాబాద్ : జయశంకర్ వ్యవసాయ వర్సిటీ వీసీ ప్రవీణ్ రావు.. పీజేటీఎస్ఏయూ రూపొందించిన 11 వంగడాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వీసీ ప్రవీణ్ రావు మాట్లాడుతూ.. వరిలో 5 రకాలు, జొన్నలో 2 వంగడాలతో పాటు సోయాచిక్కుడు, కంది, పెసర, నువ్వుల వంగడాలను విడుదల చేసినట్లు తెలిపారు. వర్సిటీ తరపున ఇప్పటి వరకు 42 రకాల వంగాలు విడుదల చేశామన్నారు.
తెలంగాణ సహా ఇతర రాష్ర్టాల్లో తమ వంగడాలను రైతులు ఆదరిస్తున్నారని వీసీ తెలిపారు. డ్రోన్ టెక్నాలజీ పరిశోధనకు వర్సిటీకి అనుమతి ఉందన్నారు. ఇప్పటికే 5 పంటల్లో డ్రోన్ టెక్నాలజీ పరిశోధనలు పూర్తి చేశామన్నారు. గ్రామీణ యువతకు డ్రోన్ టెక్నాలజీపై శిక్షణ ఇస్తామని చెప్పారు. త్వరలో వర్సిటీ ప్రాంగణంలో అగ్రిహబ్ ప్రారంభిస్తామని వీసీ ప్రవీణ్ రావు పేర్కొన్నారు.