వనపర్తి : వనపర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (MinisterNiranjan Reddy )వినూత్న ఆలోచనతో ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నిత్యం ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలు తెలుసుకొని పరిష్కరించడం ఆయన నైజం. ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ వాలిపోతారు. తాజాగా జిల్లా కేంద్రంలోని చిరు వ్యాపారులు(small traders) ఎండకు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొన్న మంత్రి.. ‘ఓట్ ఫర్ కార్’ అనే గొడుగులు (Pink umbrellas) ముద్రించి చిరు వ్యాపారులకు అందజేశారు. ఎండకు ఇబ్బందులు పడుతున్న మాకు ఈ గొడుగు నీడనిచ్చిందని, ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేస్తామని చిరు వ్యాపారలు ముక్తకంఠంతో నినదించారు. ప్రచారంతో పాటు ప్రజలకు మేలు జరుగుతుండటంతో మంత్రిని పలువరు ప్రశంసించారు.
మంత్రి అందజేసిన గులాబీ గొడుగుల కింద వ్యాపారం చేసుకుంటున్న దృశ్యం