HMDA | హైదరాబాద్ : కోకాపేట నియో పోలిస్ ఫేజ్-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. నియో పోలిస్ భూములు వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. భూములు భారీ ధరకు అమ్ముడుపోయాయి. 10వ నెంబర్ ప్లాట్లో ఎకరం ధర రూ. 100 కోట్ల మార్క్ దాటింది. ఏపీఆర్ – రాజ్పుష్ప కంపెనీల మధ్య హోరాహోరీ బిడ్డింగ్ కొనసాగింది. ప్లాట్ నెంబర్ 9లో ఎకరం భూమి ధర రూ. 76.50 కోట్లు పలికింది.. మొత్తంగా రూ. 250 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది.
10వ నెంబర్ ప్లాట్లో 3.60 ఎకరాల భూమి ఉంది. 11వ నెంబర్ ప్లాట్లో 7.53 ఎకరాలు, 14వ నెంబర్ ప్లాట్లో 7.34 ఎకరాలు ఉంది. ఈ మూడింటికి వేలం కొనసాగుతోంది. ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి సంస్థలు పోటీ పడ్డాయి. ఎకరం భూమికి కనీస ధర రూ. 35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణయించింది.
నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం సమకూరింది. తాజాగా నిర్వహించిన వేలంతో.. ఇప్పటి వరకు కోకాపేట నియో పోలిస్లో 26.86 ఎకరాలకు వేలం పూర్తయింది. గురువారం మధ్యాహ్నాం 3 గంటల నుంచి ఇప్పటి వరకు 18.47 ఎకరాలకు వేలం కొనసాగుతోంది. ప్రస్తుతం నియో పోలిస్లో 10, 11, 14 ప్లాట్లకు వేలం కొనసాగుతోంది. ఈ ప్లాట్లకు కూడా భారీగా ధర పలికే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.