హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ): టీఎస్ పీజీఈసెట్-2023 ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ ఈ నెల 31 నుంచి ఆగస్టు 18 వరకు కొనసాగుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి తెలిపారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని తన కార్యాలయంలో పీజీఈసెట్ షెడ్యూల్ను విడుదల చేశారు. ఈ నెల 28న కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు లింబాద్రి తెలిపారు. ఆగస్టు 7 నుంచి 9వ తేదీ వరకు ప్రత్యేక కోటా అభ్యర్థుల ఫిజికల్ వెరిఫికేషన్, ఆగస్టు 21 నుంచి 23 వరకు వెబ్ ఆప్షన్లు, ఆగస్టు 24న వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం కల్పించామని లింబాద్రి తెలిపారు. ఆగస్టు 26న ఎంపికైన అభ్యర్థుల జాబితా వెల్లడిస్తామని, సీటు వచ్చిన విద్యార్థులు ఆగస్టు 28 నుంచి 30 వరకు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని లింబాద్రి సూచించారు. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు రెండోవిడత ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్, సెప్టెంబర్ 11 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లు, సెప్టెంబర్ 13న వెబ్ ఆప్షన్లను సవరించుకోవచ్చని చెప్పారు. సెప్టెంబర్ 16న ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని తెలిపారు. సీటు వచ్చిన విద్యార్థులు సెప్టెంబర్ 19 నుంచి 23 వరకు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు. సెప్టెంబర్ 19 నుంచి తరగతులు ప్రారంభిస్తామని లింబాద్రి తెలిపారు. లింబాద్రి వెంట ఉన్నత విద్యామండలి వైస్ చైర్పర్సన్లు వీ వెంకటరమణ, ఎస్కే మహమూద్, సెక్రటరీ ఎన్ శ్రీనివాస్రావు తదితరులు ఉన్నారు.