PSTU | తెలంగాణలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో 2023-24 విద్యాసంవత్సరానికి గానూ పీజీ, యూజీ, పీజీ డిప్లొమా, డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల నిమిత్తం నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా శిల్పం, చిత్రలేఖనం, డిజైన్స్, లైబ్రరీ సైన్స్, సంగీతం, రంగస్థలం, నృత్యం, జానపదం, తెలుగు, చరిత్ర, పర్యాటకం, భాషా శాస్త్రం, జర్నలిజం, జ్యోతిషం, యోగా తదితర కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూన్ 16వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఆలస్య రుసుముతో జూన్ 30వ తేదీ లోగా యూనివర్సిటీకి సమర్పించాల్సిందిగా వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు.
2023-24 విద్యా సంవత్సరానికి గానూ భాషా శాస్త్రం, సంగీతం, నృత్యం, రంగస్థలం, జానపదం, జర్నలిజం, చరిత్ర, సంస్కృతి, పురావస్తు శాస్త్రం, జానపద గిరిజన విజ్ఞాన అంశాల్లో పీహెచ్డీ ప్రోగ్రాంలలో ప్రవేశం కోసం ఆన్లైన్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం www.teluguuniversity.ac.in, www.pstucet.org అనే వెబ్సైట్లను లాగిన్ అవొచ్చు.