హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): మహబూబ్నగర్ ఎమ్మెల్యేగా తన ఎన్నికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను ప్రాథమిక దశలోనే కొట్టివేయాలంటూ రాష్ట్ర మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ చేసుకున్న విన్నపాన్ని హైకోర్టు తోసిపుచ్చిం ది. ఎన్నికల అఫిడవిట్లో ఆయన వాస్తవాలను గోప్యం గా ఉంచారని ఆరోపిస్తూ రాఘవేంద్రరాజు దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ విచారణకు అర్హమైనదేనని జస్టిస్ ఎం లక్ష్మణ్ ప్రకటించారు.