హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రంజాన్ పండుగ నేపథ్యంలో రాష్ట్రంలోని ముస్లిం ఉద్యోగులు గంట ముందే విధులు ముగించుకునేందుకు సర్కార్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లోని కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్, కార్పొరేషన్ ఉద్యోగులందరికి ఈ అనుమతి వర్తిస్తుందని స్పష్టంచేశారు. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు రంజాన్ దీక్షలు ప్రారంభంకానున్నాయి.