హైదరాబాద్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హజ్ కమిటీ పనితీరు అద్భుతంగా ఉన్నదని కర్ణాటక రాష్ట్ర హజ్కమిటీ చైర్మన్ మహ్మద్ రఫీయుద్దీన్ కచారివాలే కొనియాడారు. గురువారం ఆయన హైదరాబాద్లోని రాష్ట్ర హజ్ హౌస్ను సం దర్శించారు. రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీంతో భేటీ అయ్యారు. హజ్ సీజన్ కార్యకలాపాలపై చర్చించారు. మహ్మద్ రఫీయుద్దీన్ కచారివాలేను రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ మహమ్మద్ సలీం సన్మానించారు. కార్యక్రమంలో హజ్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.