CM KCR | స్వరాష్ట్రంగా అవతరించిన అనతి కాలంలోనే సంక్షేమంలో, అభివృద్ధిలో అగ్రగామిగా వెలుగొందుతున్న తెలంగాణపై యావత్ దేశం చూపు నిలిపింది. సర్వజనాభ్యుదయమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న పటిష్ట కార్యాచరణకు రైతులు, మహిళలు, మేధావులు, సైనికులు ఆకర్షితులవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీకి జై కొడుతున్నారు. మహారాష్ట్ర బీజేపీ మైనార్టీ నేతలు ఆదివారం హైదరాబాద్లో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికలు రాగానే ప్రజలు ఆగమాగం కావద్దని, ప్రజల కోసం పనిచేసే పార్టీని, ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పుడే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయని స్పష్టం చేశారు. ఆరేడు దశాబ్దాలుగా గెలిపించిన పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. మహారాష్ట్రలో పుష్కలమైన సహజ వనరులున్నాయని, అక్కడే ఎన్నో నదులు పుట్టి, ప్రవహిస్తున్నా గ్రామాలు, పట్టణాలు నీళ్ళు లేక ఎందుకు గోసపడుతున్నాయో, అందుకు కారణమైన మూలాలను ప్రజలు గుర్తించాలని కోరారు.
‘మనం ఓట్లేస్తూ పోతున్నాం, వాళ్ళు గెలుస్తూ పోతున్నారు. ఇకనైనా మన ఆలోచనతీరు మారాలి. ఫూలే, అంబేద్కర్ వంటి ఎందరో సంఘసంస్కర్తలు, మేధావులు పుట్టిన నేల, నీరు, విద్యుత్ వంటి కనీస సౌకర్యాలు లేక వెనుబాటుకు గురికావడం శోచనీయం` అని సీఎం కేసీఆర్ అన్నారు. వారి స్ఫూర్తితో దేశంలో సమూల మార్పే లక్ష్యంగా ప్రజలు చైతన్యులై ఉద్యమించాలని కోరారు.
కాంగ్రెస్, బీజేపీలకు అధికారం ఇస్తూ పోతున్నా ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పు రాకపోవడం పై ప్రజలు, యువత ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ పార్టీలకు ప్రత్యామ్నాయంగా అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో ఉద్యమించిన బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించాలని సీఎం కోరారు. బీజేపీ పాలనలో హిందువులు, ముస్లింలు, ఇతర వర్గాలకు ఒరగబెట్టిందేమీ లేదని, మతం పేరుతో పబ్బం గడుపుకోవడమే బీజేపీ వ్యూహమని సీఎం తేల్చిచెప్పారు. దీన్ని యువత గుర్తించాలని పిలుపునిచ్చారు.
సహజవనరులకు నెలవైన మహారాష్ట్రను ఇప్పటిదాకా పాలించిన పార్టీలు లూటీ చేశాయని, ప్రజలు ఇకనైనా మేల్కొనాలని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ పథకాలను అమలు చేస్తే అక్కడి పార్టీలే దివాళా తీస్తాయి కానీ ప్రజలు కాదనీ, ప్రజల జీవితాల్లో దీపావళి వెలుగులు ప్రసరిస్తాయని అన్నారు. బీఆర్ఎస్ పార్టీతోనే దేశ రాజకీయాల్లో సమూల మార్పులు ఖాయమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మైనార్టీ నేతలు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని మహారాష్ట్రలోని గడప గడప చర్చిస్తున్నదని అన్నారు. గంగా జమునా తెహజీబ్ కు తెలంగాణ నిదర్శనంగా నిలుస్తున్నదని అన్నారు. దేశంలో మత ఛాందస వాదాన్ని కూకటివేళ్ళతో పెకలించి, సెక్యులరిజాన్ని నెలకొల్పాలంటే బిఆర్ఎస్ పార్టీతో మాత్రమే సాధ్యమవుతుందనే విశ్వాసాన్ని మైనార్టీ నేతలు ప్రకటించారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు అహరహం శ్రమిస్తామని తేల్చి చెప్పారు.
సంఘర్ష్ కామ్ గార్ కర్మాచారి యూనియన్, ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసో సియేషన్, అన్నా మాథాడి ట్రాన్స్ పోర్టు కామ్ గార్ యూనియన్ వంటి సంస్థలతో పాటు సంస్థ ప్రెసిడెంట్ సంజయ్ దినకర్ పాటిల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. షోలాపూర్ నుంచి వల్యాల నగేష్ నేతృత్వంలో ముస్లిం మైనార్టీ నేతలు, బీడ్ జిల్లా నుంచి ఫూల్ చంద్ కరాడ్ ఆధ్వర్యంలో, మాజీ ఎమ్మెల్యే ముల్లర్ అంకోలా నుంచి, మహారాష్ట్ర కిసాన్ సెల్ ప్రెసిడెంట్ సంజయ్ పాటిల్ కొల్లాపూర్ నుంచి బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
మైనార్టీ నేతలు బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ సిటి ప్రెసిడెంట్ మొహసీన్ షేక్, వీరిలో బిజెపి మైనార్టీ ఫ్రంట్ ఎగ్జిక్యూటివ్ మెంటర్ మహారాష్ట్ర స్టేట్ జాకీర్ హుస్సేన్ దోకా, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ వుమెన్ సిటి ప్రెసిడెంట్ బిల్క్విస్ సయ్యద్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ సిటి సెక్రటరీలు కరీమ్ సయ్యద్, హజి అకిల్ నల్వర్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ సిటి వైస్ ప్రెసిడెంట్ అఖలక్ మషల్కర్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ జోనల్ ప్రెసిడెంట్ సిటి సెంటర్ రజ్వాన్ షేక్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ మీడియా హెడ్ లు ఎక్బాల్ భగవాన్, రిజ్వాన్ పీర్జాదే, సల్మాన్ కంప్లి, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజహర్ నదాఫ్, బిజెపి మైనార్టీ ఫ్రంట్ సోలాపూర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ అజహర్ పఠాన్, బిజెపి సిటీ సెక్రటరీ హాజి అహ్మద్ నల్వార్, బిజెపి ముస్లిం సెల్ వైస్ ప్రెసిడెంట్ అజారుద్దీన్ నదాఫ్, ఇతర భాధ్యులు రిజ్వాన్ అబ్దుల్ ఆరీఫ్, షబ్బీర్ ఇమామ్ షేక్, అకారీమ్ సయ్యద్, అక్లక్ మషల్కర్, అజహర్ పఠాన్, జీషాన్ సలీమ్ సయ్యద్, సల్మాన్ కుంపల్లి, సజ్జద్ రజ్ బరే, బిల్కిస్ గాఫుర్ సయ్యద్, జకీర్ దోక, చాంద్ సయ్యద్, సద్దాం నదాఫ్, ఆసిఫ్ సయ్యద్, హలీమా షేక్, అషరఫ్ పోట్కుండే, ఫిరోజ్ జమాదార్, హజి షాన్వాజ్ షేక్, మెహబూబ్ సయ్యద్, రఘు అంతోజమ్, దీపక్ వీరబత్తిని తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
వీరితో పాటు నాందేడ్ జిల్లా జెడ్ పి మెంబర్లు సంతోష్ వర్కాడ్, సాహెబ్రావో ధాంగే, ప్రతాప్ దేశ్ ముఖ్, బల్వంత్ పుయడ్, గ్రామ పంచాయతీ మెంబర్లు రాహుల్ అథవాలే, ఓమ్ పవార్, నర్సింగ్ అథవాలేతో పాటు పలు రాజకీయ సంఘాలకు చెందిన ప్రముఖులు, ఇతర పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేతలు బిఆర్ఎస్ లో చేరారు. వీరిలో ఓమ్ కార్ రఘునాథ్ బడఖ్, ప్రశాంత్ కుండ్లిక్రావ్ మాస్కే, హనుమంత్ మహారాజ్ పహునే, రామ్ దాస్ బన్కర్, దాదాసాహెబ్ ఖాంగల్, అన్నా సుప్నార్, శంకర్ కోప్నర్, అశోక్ నివృత్తి బాగుల్, ప్రవీణ్ తింబక్ అరు, సుభాష్ దాదా హల్నర్, జిశాన్ జివాని, పయజ్ కురేషి, అభిజిత్ అశోక్ బాగుల్ తదితరులున్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇంఛార్జి కల్వకుంట్ల వంశీధర్ రావు, ఎమ్మెల్సీ లు పల్లా రాజశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి, బీఆర్ఎస్ నాయకులు శంకరన్న ధోండ్గే, మాణిక్ కదమ్ తదితరులు పాల్గొన్నారు.