మహబూబ్నగర్ టౌన్, ఆగస్టు 28 : రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలు అండగా ఉన్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ కులమతాలకు అతీతంగా అన్ని వర్గాల సంక్షేమానికి పాటుపడుతున్నట్టు చెప్పారు. ఆదివారం మహబూబ్నగర్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో టూ వీలర్స్, బైక్ మెకానిక్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు విజయ్కుమార్, సురేందర్, పట్టణ అధ్యక్షుడు సిద్ధేశ్వర్, కౌన్సిలర్లు రాంలక్ష్మణ్, జాజిమొగ్గ నర్సింహులుతోపాటు 200 మంది టీఆర్ఎస్లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో కేసీఆర్ సర్కారు ప్రజలకు అండగా నిలిచిందన్నారు.
బాలానగర్, ఆగస్టు 28 : మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం నేరళ్లపల్లికి చెందిన 21 మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు సర్పంచ్ ఖలీల్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్లో చేరారు. వీరికి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.