మహబూబాబాద్ : తెలంగాణ రైతులు సంతోషంగా ఉంటే బీజేపీ ప్రభుత్వం ఓర్వలేకపోతున్నది. రైతులపై కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా..రేపు గ్రామ గ్రామాన నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆదివారం మంత్రి స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్తో కలిసి మహబూబాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
సీఎం కేసీఆర్కి అండగా ఉన్న రైతులను ఇబ్బంది పెట్టాలని బీజేపీ ప్రభుత్వం చూస్తుందని మండిపడ్డారు. 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు ఉత్పత్తి చేశారంటే అది తెలంగాణ రాష్ట్ర సీఎం ఘనతే అన్నారు. యసంగి వడ్లు కొనం అనే బీజేపీ నాయకుల మాటలను తిప్పి కొట్టి తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
దేశంలో ఆకలి చావులు ఉన్నాయి. పేదరికం పెరుగుతుందని అనేక ప్రపంచ దేశాల సర్వేలు చెబుతుంటే మోదీ మాత్రం గొప్పలు చెప్పుతున్నాడని మండిపడ్డారు. లక్షల కోట్ల ఉత్త బడ్జెట్ పెట్టే బీజేపీ ప్రభుత్వం పేదవారికి అన్నం పెట్టలేకపోతుందని విమర్శించారు. సీఎం కేసీఆర్ లాంటి నాయకున్ని డైరెక్ట్ గా మోడీ ఎదుర్కోలేక ఇలాంటి నాటకాలకు తెరలేపుతున్నాడని ఆరోపించారు.
ఢిల్లీలో ఒక మాట గల్లీలో ఒక మాట చెప్పే బీజేపీ నాయకులను రైతులే తరిమికొడుతారన్నారు. గల్లీ పార్టీ ఢిల్లీ పార్టీ అని మాట్లాడే బీజేపీ నాయకులు గల్లీల్లో ఉన్న రైతులకు ఏమి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. రేపటి ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.