హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నీటి వినియోగం, పారిశుద్ధ్యంపై ప్రజలకు అవగాహన పెరగాలని శాసన మండలి చైర్మన్ గుత్తా సు ఖేందర్రెడ్డి సూచించారు. నీటిని పొ దుపుగా వినియోగిస్తూ భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని కోరారు. ప్రపం చ నీటి దినోత్సవాన్ని పురసరించుకొని జలమండలి, గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 31 వరకు ‘నీరు, పారిశుద్ధ్యంపై అవగాహన, ఆచరణ’ అనే అంశంపై కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో జలమండలి, గాంధీ ట్రస్ట్ సభ్యులతో కలిసి ఆ కార్యక్రమాల పోస్టర్ను బుధవారం గుత్తా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాగునీటి ప్రాజెక్టులను నిర్మించి ప్రజలకు తాగు, సాగునీటి సమస్య రాకుండా, రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని అన్నారు. దేశంలో మిషన్ భగీరథ ద్వారా ప్రతిఇంటికీ నల్లాల ద్వారా స్వచ్ఛమైన తాగునీటిని అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. నీటి వినియోగంపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టిన నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రతిష్ఠాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్రెడ్డి, కన్వీనర్ గిరిధర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.