టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజు
హుజూరాబాద్, ఆగస్టు 29: దళితుల భూములను కబ్జాచేసిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు తగిన బుద్ధి చెప్పాలని టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజుమాదిగ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా హు జూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. దళితబంధు పథకాన్ని స్వాగతిస్తున్నామని, ఇందు కు కృతజ్ఞతగా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ను గెలిపించి సీఎం కేసీఆర్కు కానుకగా ఇస్తామని ప్రకటించారు. లెఫ్ట్ భావాలు కలిగిన ఈటల బీజేపీలో ఎలా చేరుతారని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితులపై దాడులు, లైంగిక దాడులు జరుగుతున్నాయని, ఆ పార్టీలో చేరిన ఈటలకు దళితులపై ప్రేమ ఎలా ఉంటుందని నిలదీశారు. సమావేశంలో టీఎమ్మార్పీఎస్ నాయకులు సుంకశాల సంపత్ మాదిగ, మీసాల ఎల్లేశ్, కొండల్ నరేశ్, దాసారాపు శ్యాం, దాసారపు రాజు తదితరులు పాల్గొన్నారు.