హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ) : పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందని పెన్షనర్ల జేఏసీ ఆరోపించింది. తక్షణమే స్పందించి రాష్ట్రంలోని పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన జేఏసీ సమావేశంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈహెచ్ఎస్ సహా మూ డు పెండింగ్ డీఏలను అమలు చేస్తామని కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించారని, కానీ ఇంత వరకు అతీగతీలేదని జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య ఆవేదన వ్యక్తంచేశారు. పెన్షనర్ల పెండింగ్ బిల్లులను కూడా మంజూచేయాలని, ఐఆర్ను 20శాతానికి పెంచాలని కోరారు.