యాదగిరిగుట్ట/ఆలేరు రూరల్, మే 29 : ‘రెండు నెలలుగా పింఛన్ ఇవ్వడం లేదు. పదిరోజులుగా మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు’ అంటూ వికలాంగులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు శుక్రవారం యాదగిరిగుట్ట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. చైర్పర్సన్ గుండ్లపల్లి వాణీభరత్గౌడ్ను నిలదీశారు. కార్యాలయంలోకి వెళ్లకుండా ఆమెను అడ్డుకున్నారు.
రూ.2,016 ఇవ్వాల్సి ఉండగా కేవలం రూ.2 వేలు మాత్రమే ఇస్తున్నారని, మిగతా రూ.16 ఇవ్వడం లేదని వాపోయారు. పింఛన్ ఇచ్చేలా చూస్తానని ఎన్నికల సమయంలో చెప్పిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఐలయ్య ఇప్పుడు కనిపించడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతినెలా పింఛన్ ఇచ్చిందని గుర్తుచేశారు. కాగా సకాలంలో పింఛన్ అందజేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రధాన రహదారిపై పింఛన్దారులు ధర్నా చేశారు.