హైదరాబాద్, మార్చి 7 : ఆసరా పింఛన్ల వయోపరిమితిని 57 ఏండ్లకు తగ్గించిన ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి అర్హులను ఎంపిక చేసి కొత్త పింఛన్లు ఇవ్వనున్నది. ఇందుకోసం బడ్జెట్లో అదనంగా రూ.2,128 కోట్లు కేటాయించింది. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, చేనేత, గీత కార్మికులు, ఎయిడ్స్ రోగులు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు ఆసరా పింఛన్లను అందిస్తున్నది. వీరి కోసం బడ్జెట్లో మొత్తం రూ.11,728 కోట్లు కేటాయించింది.