హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇతర పార్టీల నుంచి ఫిరాయింపులను పోత్రహిస్తున్న కాంగ్రెస్కు ఎదురుదెబ్బ తగిలింది. పెద్దపల్లి(Pedpadalli )ఎంపీ టికెట్ ఆశించి ఇటీవలే కాంగ్రెస్లో చేరిన వెంకటేష్ నేత(MP Venkatesh netha) ఆ పార్టీకి ఝలక్ ఇచ్చారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ ఇవ్వకుండా కాంగ్రెస్లోను మొండిచేయి చూపడంతో ఇప్పుడు బీజేపీలో(BJP) చేరనున్నట్లు సమాచారం.
ఇప్పటికే పెద్దపల్లి బీజేపీ అభ్యర్థిగా గోమాస శ్రీనివాస్ పేరును ప్రకటించిన అధిష్ఠానం ప్రకటించింది. వెంకటేష్ నేత పార్టీలో చేరితే గోమాస శ్రీనివాస్ను బుజ్జగించి ఎంపీ అభ్యర్థిగా వెంకటేష్ నేత పేరును ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తున్నది.