ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. కాగజ్నగర్ మండలం అందెవెళ్లి వద్ద పెద్దవాగుపై (Peddavagu) ఉన్న వంతెన కూలిపోయింది. తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో ప్రాణనష్టం తప్పినట్లయింది. గతేడాది కురిసిన వానలకు వంతెన కొద్దిగా కుంగిపోయింది. అయితే కొన్ని రోజులుగా కురుస్తున్న వానలకు పెద్దవాగులో వరద ప్రవాహం పెరిగింది.
దీంతో వరద తాకిడికి బుధవారం తెల్లవారుజామన బ్రిడ్జి కూలిపోయింది. ఈ నేపథ్యంలో అధికారులు బ్రిడ్జిపై రాకపోకలను నిలిపివేశారు. రహదారికి అడ్డంగా రెండువైపులు బారికేడ్లు పెట్టారు. ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.