Peddapally | పెద్దపల్లి : టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్లోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ కళ్యాణ మండపంలో జరుగుచున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కలెక్టర్ ముజామిల్ ఖాన్ గణేష్ మంటపంలో పండితుల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆలయ కమిటీ చైర్మన్ బొంకూరి శంకర్, డిస్ట్రిక్ట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ రవుఫ్ ఖాన్, వ్యవసాయ అధికారి ఆది రెడ్డి, టీఎన్జీవోస్ నాయకులు నాయకులు సుధీర్, సందీప్ రావు, శ్రీనివాస్, సందీప్ రెడ్డి, కొమరయ్య, సురేష్, ఆంజనేయులు, రత్నం, అనిత రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో ఉద్యోగస్తులు పాల్గొన్నారు.