మంచిర్యాల: జిల్లాలోని జైపూర్లో అర్ధరాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. జైపూర్ మండలంలోని ఇందారం చెక్పోస్టు వద్ద గురువారం అర్ధరాత్రి పాల వ్యాను ఓ మోటారు సైకిల్ను ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని మల్లేశంగా గుర్తించారు.
మల్లేశం.. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గన్మెన్గా పనిచేస్తున్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.