హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): అటవీశాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి పోలీస్శాఖతో మరింత సమన్వయం, సహకారం అందించాలని తెలంగాణ అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ డీజీపీ మహేందర్రెడ్డిని కోరారు. గురువారం డీజీపీ కార్యాలయంలో డీజీపీతో డోబ్రియాల్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య, తదనంతరం పరిణామాలపై చర్చించారు. సున్నిత ప్రాంతాల్లో పని చేస్తున్న అటవీశాఖ సిబ్బందికి తగిన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన డీజీపీ మహేందర్రెడ్డి.. పోలీస్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.