హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): వివిధ ప్రాజెక్టుల డీపీఆర్ తయారీ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి వ్యాప్కోస్ సంస్థ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గురువారం లేఖ రాసింది. వార్ధా, సీతారామ, మల్లన్నసాగర్, గోదావరిపై లైడార్ సర్వే, కాళేశ్వరం ప్రాజెక్టు ఇలా మొత్తం తొమ్మిది ప్రాజెక్టుల డీపీఆర్లను వ్యాప్కోస్ సంస్థ తయారీ చేసింది. అందుకు రూ.14.25 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉన్నది. ఆ నిధులను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర నీటి పారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్కు వ్యాప్కోస్ సంస్థ లేఖ రాసింది.