హైదరాబాద్, ఏప్రిల్8 (నమస్తే తెలంగాణ): అస్సాం పోలీసులు గౌహతి క్రైమ్బ్రాంచ్లో నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ కాంగ్రెస్ నేత పవన్ఖేరా తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ భార్య రిణికి భూయాన్ శర్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో అస్సాం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదని, అందువల్ల ముందస్తు బెయిలు మంజూరు చేయాలంటూ పవన్ ఖేరా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై గురువారం జస్టిస్ కే సుజన విచారణ చేపట్టే అవకాశముంది.