హైదరాబాద్, మే 3 ( నమస్తే తెలంగాణ ): ఆర్నెల్ల క్రితం కేవలం లక్ష రూపాయల క్యాపిటల్తో పుట్టిన ఓ కంపెనీకి వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థను ఏ విధంగా అప్పగిస్తారని రాష్ట్ర ఐటీ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లాభాల్లో ఉన్న పవన్హన్స్ కంపెనీ అమ్మకం ప్రక్రియ అనేక ప్రశ్నలకు, సందేహాలకు తావిస్తున్నదని మంగళవారం ట్వీట్చేశారు. 2017లో పవన్హన్స్ కంపెనీ విలువ రూ.3,700 కోట్లు కాగా.. అందులో 49 శాతం వాటాను కేవలం రూ.211 కోట్లకే ఎలా విక్రయిస్తారని కేటీఆర్ నిలదీశారు. దీనికి ఎన్పీఏ (నాన్ పర్ఫార్మెన్స్ గవర్నమెంట్) దగ్గర సమాధానం ఉన్నదా? అని ప్రశ్నించారు. రంజాన్ శుభాకాంక్షలు రాష్ట్రంలోని ముస్లింలకు మంత్రి కేటీఆర్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈద్ ముబారక్ అంటూ మంగళవారం ట్వీట్చేశారు.