హైదరాబాద్ : హైదరాబాద్ జూబ్లీహిల్స్ (Jubilee Hills) వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకు పవిత్రోత్సవాలు(Pavitrotsavams ) శాస్త్రోక్తంగా నిర్వహించనున్నట్లు టీటీడీ( TTD ) అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ఈనెల 16న సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు.
యాత్రికులు, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాలవల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. పవిత్రోత్సవాల్లో మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, 18న పవిత్ర సమర్పణ, పవిత్ర హోమాలు , చివరిరోజు మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన జరుగనుందని వెల్లడించారు. . పవిత్రోత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తామని పేర్కొన్నారు.