హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఏటీఎంలోకి వెళ్లిన తర్వాత మెషీన్లో కార్డును స్వైప్ లేదా ఇన్సెర్ట్ చేస్తాం. ఆ తర్వాత స్క్రీన్పై ఆప్షన్లు కనిపిస్తుంటాయి. ఆ తర్వాత కావాల్సిన డబ్బును తీసుకొని వెళ్తాం. ఇది సాధారణంగా ఏటీఎంలలో జరిగే ప్రక్రి యే.. అయితే కొన్నిసార్లు కార్డు స్వైప్ చేసిన తర్వాత ఆప్షన్లు కనిపించడం ఆలస్యం అవుతుంది. కొంత సేపటి తర్వాత ట్రాన్సాక్షన్ ప్రారంభం కాకపోతే అసహనం పెరిగిపోతుంది. మరి.. ఒక వినియోగదారుడు సగటున ఎంతసేపు ఓపికగా ఎదురుచూడగలరో తెలుసా? కేవలం ఏడు సెకండ్లు. అంటే.. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత ఏడు సెకండ్లలోపు ట్రాన్సాక్షన్ ప్రారం భం కావాల్సిందే. లేకపోతే మెషీన్ను తిట్టడమో.. కొట్టడమో.. ఏటీఎంలోని సీసీ కెమెరాల వంక చూసి బ్యాంకును తిట్టడమో చేస్తుంటారట. రిజర్వుబ్యాంక్ ఇటీవల ఓ నివేదికలో చెప్పిన విషయం ఇది.
అంత సులువు కాదు
ఏటీఎంలో కార్డ్ స్వైపింగ్ మొదలు డబ్బు బయటికి వచ్చేవరకు అంతా ఆటోమెటిక్గా సాగే ఒక సంక్లిష్ట ప్రక్రియ. ముందుగా మెషీన్ మన కార్డ్లోని చిప్లో ఉన్న డాటాను చదువాలి. ఆ అకౌంట్ నంబర్ ఏ బ్యాంకులో, ఏ బ్రాంచ్లో ఉన్నదో, అందులో ఎంత డబ్బు ఉన్నదో గుర్తించాలి. ఆ బ్యాం కుతో అనుసంధానం కావాలి. అందులో నుంచి ఎంత వరకు విత్డ్రా చేసుకోగలరో నిర్ధారించాలి. ఆ తర్వాత లావాదేవీకి అనుమతి ఇవ్వాలి. ఈ ప్రక్రియ జరుగడానికి ఎంత సమయం పడుతుందో తెలుసా! కేవలం 1 నుంచి రెండు సెకన్లలో మాత్రమే. ఏటీఎం, ఇతర నెట్వర్క్లలో ఏదైన సమస్య ఉంటే మాత్రం ఆలస్యం అవుతున్నట్లు ఆ నివేదిక వెల్లడించింది.