జన్మదినం సందర్భంగా మొక్కలునాటిన ఎమ్మెల్యే
హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి గ్రీన్చాలెంజ్లో భాగంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మొక్కలు నాటాలని ఇచ్చిన పిలుపుతో మొక్కలు నాటినట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. నాగర్కర్నూల్ నియోజకవర్గ ప్రజలు కూడా మొక్కలు నాటి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపాలని కోరారు.