హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): అసెంబ్లీ ఆమోదం పొందిన ఆర్టీసీ ఉ ద్యోగుల విలీన బిల్లుపై గవర్నర్ సంతకం చే యాలని టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి థామస్రెడ్డి కోరారు. ఆర్టీసీ విలీన ప్రక్రియపై ఏపీలో అధ్యయనం చేసిన రూపొందించిన సమగ్ర నివేదికను టీఎంయూ నేతలు కమలాకర్గౌడ్, యాదన్నతో కలిసి థామస్రెడ్డి బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శితోపాటు మంత్రుల కార్యాలయాల్లో సమర్పించారు. అనంతరం సచివాలయంలోని మీడియా సెంటర్లో థామస్రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఆమోదించిన ఆర్టీసీ విలీన బిల్లుకు ఆమోదం తెలుపని పక్షంలో పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఆగస్టు నుంచే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, క్యాడర్లవారీగా అందరికీ న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.