ఘట్కేసర్,ఏప్రిల్21 : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పండుగలా నిర్వహించాలని మంత్రి మల్లారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపు నిచ్చారు. వరంగల్ రోడ్డు పై జెండాలు, భారీ కటౌట్లు, స్వాగత తోరణాలను ఏర్పాటు చేయాలన్నారు. గురువారం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘట్కేసర్, పోచారం మున్సిపాలిటీలు, ఘట్కేసర్ మండల టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 21 సంవత్సరాలు పూర్తయింది అన్నారు. ఈ సందర్భంగా..ఈ నెల 27 నిర్వహిస్తున్న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా చేపట్టాలని సూచించారు. మున్సిపాలిటీలలో వార్డుల వారీగా, మండలంలో గ్రామాల వారీగా పార్టీ జెండాలను ఎగురవేయాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు సంఘటితంగా ఈ ఆవిర్భావ దినోత్సవాలను నిర్వహించాలన్నారు.
ముఖ్యంగా వరంగల్ రోడ్డు పై స్వాగత తోరణాలు పెద్ద ఎత్తున తీర్చిదిద్ది పండగ వాతావరణం తీసుక రావాలని పార్టీ శ్రేణులను కోరారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్చంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్లు ఎం. పావని, బి.కొండల్రెడ్డి, ఎంపీపీ ఏనుగు సుదర్శన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.