హైదారాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న స్టార్టప్లను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రత్యేకంగా చర్యలు చేపట్టింది. సిద్దిపేటలోని ప్రభుత్వ దవాఖాన, మెడికల్ కాలేజీతో 7 స్టార్టప్లు కలిసి పనిచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇందులో కేర్ మదర్, బీ ఏబుల్ హెల్త్, అన్వార్డ్ అసిస్ట్, అడివో డయాగ్నస్టిక్స్, మాయాఎండీ.ఏఐ, వైలీ-స్పార్కోలైఫ్, డీప్ ప్యాక్ట్స్.ఐవో స్టార్టప్లు ప్రభుత్వ దవాఖానతో కలిసి పనిచేయనున్నాయి. టెక్నాలజీ రంగంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్ ప్రత్యేకంగా కృషి చేస్తున్నది.