మణికొండ, జనవరి 3: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ అత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్ మాతృమూర్తి, మాజీ ఎమ్మెల్యే కాళికాంబ (93) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. గండిపేట మండలం మంచిరేవులలో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్లోని నర్సాపురం నియోజకవర్గం నుంచి 1981లో ఆమె శాసన సభ్యురాలిగా ఎన్నికయ్యారు. కాళికాంబకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భర్త పరకాల శేషావతారం ఉమ్మడి రాష్ట్రంలో టీ అంజయ్య మంత్రి వర్గంలో రెండు పర్యాయాలు మంత్రిగా పనిచేశారు. బుధవారం కాళికాంబ అంత్యక్రియలు నిర్వహించగా, బిజీ షెడ్యూల్ కారణంగా కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ హాజరుకాలేదు.