కాబూల్, ఫిబ్రవరి 15: అఫ్గానిస్థాన్లో మత నియంతృత్వాన్ని అమలు చేస్తున్న తాలిబన్లు ఒక సైనిక యూనిట్కు ‘పానిపట్ దళం’ అని పేరుపెట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అఫ్గాన్ సుల్తాన్ షా అబ్దాలీ 1761లో మరాఠాలపై మూడో పానిపట్ యుద్ధంలో విజయం సాధించిన నేపథ్యమే దీనికి కారణం. అఫ్గానిస్థాన్లో ఇప్పటికీ ఆ విజయం గురించి కథలుకథలుగా చెప్పుకొంటారు. హర్యానాలో ప్రస్తుతం పానిపట్ జిల్లా కేంద్రంగా ఉంది. తాజాగా తాలిబన్లు నంగర్హార్ ప్రావిన్స్లో ఏర్పాటు చేసిన సైనికదళానికి పానిపట్ దళం అని పేరుపెట్టడంతో ఇప్పుడు పాత చరిత్ర మీదకు అందరి దృష్టి మళ్లింది. భారత్ మీద కక్షతో పాకిస్థాన్ తాలిబన్లతో ఈ పేరు పెట్టించి ఉంటుందని కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద తాలిబన్ల చర్యను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.