Dharmapuri-Karthika Shobha | ఆకాశాన మిలమిలలాడే చుక్కలన్నీ ఈ కోనేట్లో మణిదీపాలుగా వెలుగొందాయా…అన్నట్లుగా మెట్టుమెట్టుకో దీపం..అజ్ఙాన తిమిరాలు, కష్టాల చీకట్లను తరిమికొడుతూ అడుగుఅడుగుకూ ఓ దీపం..ఒక్కో దీపం అలా జ్వాలా తోరణమై పంచ సహస్ర దీపాలంకరణగా మారింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నవనారిసింహ క్ష్రేతాల్లో ఒకటైన ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మపుష్కరిణి (కోనేరు) సోమవారం రాత్రి ఇలా దేదీప్యమానంగా వెలుగొందింది.
కార్తీక పౌర్ణమి సందర్భంగా దేవస్థానం ప్రతి ఏటా నిర్వహించే పంచ సహస్రదీపాలంకరణ కార్యక్రమంలో భాగంగా ముందుగా దేవస్థాన వేదపండితులు, అర్చకులు సిబ్బంది మేళతాళాల మధ్య బ్రహ్మ పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. కోనేరు మధ్యగల మండపంలో స్వామివారి చిత్రపటాన్ని ఉంచి దీపం వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోనేరు మెట్ల మీద చుట్టూ అప్పటికే ఏర్పాటు చేసిన ఉంచిన దీపాలను అక్కడే ఉన్న భక్తులు వెలిగించగా కోనేరు ఒక్కసారిగా దేదీప్యమానంగా వెలుగొందింది.
ఈ కార్యక్రమంలో ఈఓ సంకటాల శ్రీనివాస్, రెనోవేషన్ కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, ఇనుగంటి రమావేంకటేశ్వరరావు, అక్కనపల్లి సురేందర్, వేముల నరేశ్, గునిశెట్టి రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్శర్మ, ముత్యాల శర్మ, పాలెపు ప్రవీణ్శర్మ, సూపరింటెండెంట్ కిరణ్కుమార్, ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్, ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాసాచార్యులు, జూనియర్ అసిస్టెంట్ దేవయ్య, తిరుపతి, పురోహితులు సంతోష్కుమార్, రాజగోపాల్ తదితరులు ఉన్నారు.