యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మినరసింహాస్వామి బాలాలయంలో పంచకుండాత్మక యాగం జరగుతున్నది. బుధవారం ఉదంయ 9 గంటలకు అర్చకులురెండో పంచకుండాత్మక మహాయగంలో భాగంగా యాగశాలలో శాంతి పాఠం నిర్వహించారు. అనంతరం ద్వారాతోరణం, ధ్వజకుంభారాధనలు జరిపారు. చతుఃస్థానార్చన, షోడష కలశాభిషేకం, నిత్యాలఘుపూర్ణాహుతి నిర్వహించారు. ప్రధానాలయంలో మూల మంత్ర, మూర్తి మంత్ర జపాలు చేపట్టారు. సాయంత్రం 6 గంటల నుంచి సామూహిక శ్రీవిష్ణు సహస్రనామ పారాయణం, యాగశాలలో ద్వారా తోరణ ధ్వజకుంభ ఆరాధనలు, మూల మంత్ర హావనములు, పచగవ్యాదివాసం, నిత్యా లఘుపూర్ణాహుతి చేపట్టనున్నారు.