ఉగాది పండుగను పురస్కరించుకుని మన ఉగాది అనే అంశంపై తెలంగాణ ప్రభుత్వ జవహర్ బాలభవన్ ఆధ్వర్యంలో పెయింటిగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు డైరక్టర్, ప్రత్యేకాధికారి జి. ఉషారాణి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపా రు. పిల్లలో దాగిఉన్న సృజనాత్మకతను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పాటు ఉగాది పండుగ విశిష్టతను చాటుతూ నేటి తరానికి చాటాలనే ఉద్దేశంతో ఈ పోటీలు 5నుంచి 16సంవత్సరాల్లోపు విద్యార్థులకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పిల్లలు సృజనాత్మకతతో రూపొందించిన కళాఖండాలను ఏప్రిల్ 12లోపు kapparikishan@ gmil. comకు పంపించాలన్నారు. వివరాలకు 9848747432నంబర్ను సంప్రదించాలన్నారు. ఉత్తమ ప్రతిభ కలిగిన విద్యార్థుల కళాఖండాలకు బహుమతులను ప్రత్యేక కార్యక్రమంలో అందిస్తామన్నారు.