న్యూఢిల్లీ, ఏప్రిల్ 27: ఐబూప్రొఫెన్ వంటి నొప్పి తగ్గించే మాత్రలు (పెయిన్కిల్లర్స్) కరోనాను మరింత తీవ్రం చేస్తాయని ఐసీఎంఆర్ తెలిపింది. ఇటువంటి పెయిన్కిల్లర్స్ వేసుకోవడం హృద్రోగ బాధితులకు ప్రమాదకరమని, మూత్రపిండాలను దెబ్బతీసే ముప్పు ఉంటుందని గతంలోనూ వైద్య నిపుణులు చెబుతుండటం తెలిసిందే. కరోనా రోగులు నాన్-స్టెరాయిడల్, యాంటీ-ఇన్ఫ్లేమేటరీ మందులను (ఎన్ఎస్ఏఐడీలు) వాడొద్దని, అవసరమైతే పారాసిటమాల్ వేసుకోవాలని సూచించింది.