అబద్ధం
టీఆర్ఎస్కు చెందిన భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి బీజేపీలో చేరుతున్నట్టు పలు వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ప్రచారం జరుగుతున్నది.
వాస్తవం
ఊపిరి ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతానని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి స్పష్టంచేశారు. మునుగోడు ఉప ఎన్నికలో కనీసం డిపాజిట్ కూడా దక్కదనే భయంతో సోషల్ మీడియాలో బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. టీఆర్ఎస్ కార్యకర్తలు, మునుగోడు నియోజకవర్గ ప్రజలు బీజేపీ కుట్రల్లో చిక్కుకోవద్దని సూచించారు. అసత్య ప్రచారంపై భువనగిరి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పోలీస్ నిఘా’ రిపోర్టర్ నీలం శ్రీనివాస్పై భువనగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు.
కేసీఆర్తోనే వెలుగులు
సీఎం కేసీఆర్ సార్ అందరి జీవితాల్లో వెలుగులు నింపుతుండు. ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, వృద్ధులకు పింఛన్లు ఇస్తున్నడు. మా ఓటు టీఆర్ఎస్కే. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేదల గుండెల్లో ఉన్న కేసీఆర్ సార్ వెంటే ఉంటాం. రాజగోపాల్రెడ్డి ఎన్ని డబ్బులు పంచినా ఓడిపోతడు.
– అంబోతు దేవి, అంతపేట, మం: మర్రిగూడెం