హైదరాబాద్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ) : అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో కార్మికులకు, ఉద్యోగులకు ఈ నెల 30న వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర కార్మికశాఖ ప్రకటించింది. రాష్ట్రంలోని వివిధ పరిశ్రమలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే కార్మికులు, ఉద్యోగులు ఓటు హక్కును వినియోగించుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొన్నట్టు కార్మికశాఖ తెలిపింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రాణి కుముదిని ఉత్తర్వులు జారీ చేశారు.