హైదరాబాద్, డిసెంబర్ 31 (నమస్తే తెలంగాణ): కొత్త ఏడాదిలో ప్రతిఒక్కరు ఒక మొక్కనాటి పర్యావరణాన్ని కాపాడాలని పద్మశ్రీ వనజీవి రామయ్య కోరారు. గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శుక్రవారం రామయ్య రవీంద్రభారతిలో మొక్కనాటి మాట్లాడారు. తెలంగాణ వచ్చాక మొక్కలు నాటడం ఉద్యమంగా మారిందని, ఈ కార్యక్రమంలో యువత పాల్గొనడం ఆనందాన్ని కలిగిస్తున్నదన్నారు. కార్యక్రమంలో రామ య్య సతీమణి జానకమ్మ పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీతలు గోరటి వెంకన్న, దేవరాజు మహారాజు, సాహిత్య అకాడమీ చైర్మన్ గౌరీశంకర్ మొక్కలు నాటాలని రామయ్య చాలెంజ్ విసిరారు.