ఓదెల, ఆగస్టు 2: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల హరిపురంలోని ఓ పొలంలో భూమి కుంగింది. గ్రామంలోని ఈద పెద్ద ఓదెలు తన పొలాన్ని ఐలేశ్కు కౌలుకు ఇచ్చారు. అతను నెల రోజుల క్రితం వరి నాటు వేశారు. పొలాన్ని ట్రాక్టర్తో దున్నే సమయంలో, జంబు కొట్టి నాటు వేసే సమయంలోనూ బాగానే ఉన్నది. కానీ సోమవారం ఉదయం పొలానికి నీరు పెట్టడానికి వెళ్లగా పెద్ద గొయ్యి కన్పించినట్టు కౌలు రైతు చెబుతున్నారు. దాదాపు మీటరు వెడల్పుతో రెండు మీటర్ల లోతులో ఈ గొయ్యి ఏర్పడింది. రాత్రికి రాత్రే ఇలా జరగడంతో కౌలు రైతు ఆశ్చర్యపోయాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పొలం వద్దకు వెళ్లి పరిశీలిస్తున్నారు.