హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): కొవిడ్ రోగుల అవసరార్థం గోదావరిఖనిలో కొత్తగా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ను స్థాపించనున్నట్టు సింగరేణి సంస్థ సీఎండీ ఎన్ శ్రీధర్ చెప్పారు. రామగుండం ఏరియా దవాఖానలో యుద్ధప్రతిపాదికన ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటుచేస్తున్నామని, త్వరలోనే పాల్వంచ సహా ఇతర పట్టణాల్లో సైతం ప్లాంట్లను నెలకొల్పుతామని అన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్ నుంచి మంగళవారం సంస్థ అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బొగ్గుకున్న డిమాండ్ మేరకు రోజుకు 90 వేల టన్నులు ఉత్పత్తిచేసి, 35 రైళ్లకు తగ్గకుండా బొగ్గును రవాణాచేయాలని సీఎండీ ఆదేశించారు. ఓపెన్కాస్ట్ గనులకు కావాల్సిన పేలుడు పదార్థాలను మహారాష్ట్ర నుంచి సరఫరాకు అనుమతించాలని సీఎస్ను కోరినట్టు తెలిపారు. సింగరేణి ఉద్యోగులందరికీ కొవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. సమీక్షలో ఈడీ (బొగ్గురవాణా) జే ఆల్విన్, జీఎం మార్కెటింగ్ అండ్ కో ఆర్డినేషన్ కే సూర్యనారాయణ, ఆపరేషన్స్ డైరెక్టర్ ఎస్ చంద్రశేఖర్, అధికారులు బలరాం, డీ సత్యనారాయణరావు, మంతా శ్రీనివాస్సహా ఏరియా జీఎంలు పాల్గొన్నారు.