భద్రాచలం: కొత్తగూండెం (Kothagudem) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులను సర్వేష్, సరోజగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.